పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 14న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పార్లమెంటు సభ్యులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. సమావేశాల్లో ఏ అంశాలు ప్రస్తావించాలన్న దానిపై అవగాహన కల్పించాలని సీఎం జగన్ కు రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.
మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి సహాయ సహకారం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని లేఖలో వివరించారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలను సీఎం జగన్ పార్లమెంటు సభ్యులకు వివరించాలని తెలిపారు.
ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందు సీఎంలు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం గతంలోనూ ఉందని తెలిపారు. ఈ ఆనవాయితీని సీఎం జగన్ కూడా కొనసాగించాలని కోరుకుంటున్నామని రఘురామకృష్ణరాజు వివరించారు.
వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేశారు: నారా లోకేశ్