ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ అనే కళాఖండాన్ని చెక్కుతోన్న జక్కనకు అసహనం వచ్చేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై నేషన్ వైడ్గా బజ్ క్రియేట్ అయ్యింది. చిత్ర షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతోంది. రాజమౌళి ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నేపథ్యంలో..మూవీ అనుకున్న టైంకి వస్తుందో, లేదో అని ఫ్యాన్స్ తెగ కంగారుపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా రాజమౌళి తనయుడు..కార్తికేయ పెళ్లి నేపథ్యంలో షూట్కి స్మాల్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత..ఇద్దరు హీరోలు గాయాలపాలవ్వడంతో మరికొంత ఆలస్యం అయింది. తాజాగా చరణ్..జక్కన్నకు చిక్కులు తెచ్చిపెడుతున్నాడట. ఎన్టీఆర్ మొదటి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ కోసమే పూర్తిగా సమయం కేటాయించారు. అదిరిపోయే ఫిజిక్ కోసం కూడా చాలా కష్టపడ్డారు కూడా. కానీ చరణ్ మాత్రం మొదటి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ కోసం పూర్తిగా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాడు.
గతేడాది ఎండింగ్లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభం అయ్యింది. ఆ సమయంలో చరణ్ ‘వినయ విధేయ రామ’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అది పూర్తికాగానే చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘సైరా’ చిత్ర నిర్మాణ బాధ్యతలు బుజానికి ఎత్తుకున్నాడు. దీంతో చరణ్కు క్షణం తీరిక లేకుండా పోయింది. ఆ చిత్రం రిలీజయ్యి, ప్రమోషన్స్ అయ్యేవరకు చెర్రీ అంతా తానై వ్యవహరించాడు. ఇక ఏ పనులు లేవు..ఫుల్గా ‘ఆర్ఆర్ఆర్’ కోసం పనిచేస్తాడనుకుంటున్న టైమ్.. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాను లాంచ్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చరణ్ కూడా ఒక నిర్మాత. దీంతో రాబోయే రోజుల్లో చరణ్ బిజీగా ఉండనున్నాడు. దీంతో రాజమౌళి..’ఆర్ఆర్ఆర్’ పై దృష్టిపెట్టాలని చరణ్కు చిన్న వార్నింగ్ ఇచ్చాడట. జక్కన్న సినిమా కోసం ఎంత డెడికేషన్ చూపిస్తారో అందరికి తెలిసిందే. పాత్రల వేషధారణ, పద్దతులు, సెట్లు విషయంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే చరణ్కు కాస్త గట్టిగా చెప్పాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి చెర్రీ ఛేంజ్ అవుతాడో, లేదో చూడాలి.
కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక వ్యాఖ్యలు…