కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో ప్రభుత్వాలు అనుమతులను ఇచ్చినా, పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా.. ఇప్పట్లో షూటింగ్స్కు వెళ్లకుండా ఉండటమే బెటర్ అనుకుంటున్నారు నటీనటులంతా. అయితే తాజాగా నందమూరి నటసింహం సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్లోని అందరికీ ముందు జాగ్రత్త చర్యలుగా కరోనా నిరోధానికి సంబంధించిన హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్ను పంపిస్తూ తన సహృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ తెలిపారు. వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. “ముందు జాగ్రత్తగా కరోనా నిరోధానికి హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్ను నాకు బసవతారకం హాస్పిటల్ ద్వారా నందమూరి బాలకృష్ణగారు పంపించారు. నాకే కాదు ఈ మెడిసిన్ను ఆయన 24 క్రాఫ్ట్స్కు చెందిన అందరికీ పంపిస్తున్నారు. నన్ను గుర్తుపెట్టుకుని మరీ పంపినందుకు బాలకృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.” అని అన్నారు.
previous post