పరిషత్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు డివిజెన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ.. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. యథావిధిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. ఈ తీర్పు నేపథ్యంలో రేపే పరిషత్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ కేసులో ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపించగా.. పిటిషనర్ వర్ల రామయ్య తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు. కాగా..ఎంపీటీసీ. జెడ్పీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఆదేశాలను బెంచ్లో ఎస్ఈసీ సవాల్ చేసిన విషయం తెలిసిందే.
previous post