ఏపీలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం కావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనపై పై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. అంతర్వేది రథం కాల్చివేత చాలా బాధాకరమని తెలిపారు. చర్చి, మసీదు, ఆలయాలపై దాడులు చేసేవారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు.
అంతర్వేది ఘటన జరిగిన వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ సీఎం జగన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించారని వెల్లడించారు. దాడులు చేయడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం చంద్రబాబు సంస్కృతి అని అన్నారు. ఓట్ల కోసం రాజకీయాలు చేయడం తమకు తెలియదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుద్దేశించి మంత్రి విమర్శించారు.
రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుంది: కన్నా