ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “నా భవిష్యత్తును ఈరోజు 11.23 గంటలకు ప్రకటిస్తాను. నా శ్రేయోభిలాషులకు ఇదొక అద్భుతమైన వార్త” అని సోమవారం ఉదయం బండ్ల గణేష్ ముందుగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత చెప్పిన సమయానికే తాజాగా పవన్ కళ్యాణ్తో తీసుకున్న ఫొటోను ట్వీట్ చేసి “నా బాస్ ఓకే చెప్పారు. మరోసారి నా కల నెరవేరుతోంది. నా దేవుడు పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. పవన్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన నిర్మాత బండ్ల గణేష్.. మరోసారి ఆయనతో కలిసి పనిచేయడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
My boss said okay and once again my dreams come true .
Thank you my god @PawanKalyan 🙏. pic.twitter.com/x0s1nQy3Fy— BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2020
ఇక రెండేళ్లకు పైగా రాజకీయాలతో బిజీగా ఉండి మళ్లీ ముఖానికి రంగు వేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘వకీల్ సాబ్’ చివరి దశలో ఉంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ మూవీ, తరవాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బహుశా ఈ సినిమా తరవాత బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ సినిమా ఉండే అవకాశం ఉంది.