telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనతొ ఒక్కటైన బాలీవుడ్ జంట

hritik

కరోనా మహమ్మారి బాలీవుడ్‌కు చెందిన ఓ జంటకు మాత్రం మంచి చేసింది. గతంలో విడిపోయిన వాళ్లిద్దరినీ మళ్లీ ఒక దగ్గరకు చేర్చింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసానే నుంచి 2014లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోయినా తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో తమ పిల్లల కోసం వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తమ పిల్లలు హ్రేహాన్, హృదాన్‌కు అండగా నిలిచేందుకు సుసానే తన ఇంటికి వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హృతిక్ వెల్లడించాడు. ఈ 21 రోజులు తమందరం కలిసే ఉంటామని తెలిపాడు. `కొద్ది రోజులుగా సుసానే మా ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోంది. పిల్లల పట్ల తన ప్రేమకు ఇది నిదర్శనం. తల్లిదండ్రులగా మన బాధ్యతలను గుర్తు చేస్తూ నీవు తీసుకొన్న ఈ నిర్ణయానికి థ్యాంక్స్ సుసానే` అంటూ హృతిక్ కామెంట్ చేశాడు. విపత్కర సమయంలో పిల్లల కోసం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్న హృతిక్, సుసానేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related posts