చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కరోనాబారిన పడ్డారు. ఈ వైరస్తో చాలా మంది ప్రముఖులు కూడా మృతి చెందారు. అయితే.. తాజాగా డైరెక్టర్ క్రిష్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రామ్ చరణ్, వరుణ్ తేజ్ల పార్టీలో క్రిష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే క్రిష్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న క్రిష్.. జనవరి 4నుంచి షూటింగ్ కు ప్లాన్ చేసాడు. షూటింగ్ లో పాల్గొనే సిబ్బంది అంతా చేయించుకున్న కరోనా టెస్టులలో క్రిష్ కు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో షూటింగ్ కాన్సిల్ చేసేశాడు నిర్మాత ఏ ఎం రత్నం. కాగా.. ఇటీవలే హీరో రాం చరణ్, వరుణ్ తేజలకు గత నెల 29 కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే… ఇప్పుడు తాజాగా క్రిష్కు కూడా కరోనా సోకడంతో పవన్ సినిమాకు బ్రేక్ పడింది.
previous post