నటుడు సోనూ సూద్ తన మంచి మనసు చాటుకున్నారు. కరోనా వైరస్పై పోరాటంలో విశేష కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ముంబైలోని తన హోటల్ను ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనాపై పోరాడుతున్న వారికి సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు సోనూ సూద్ తెలిపారు. ‘‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి చిన్న సాయం చేసే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. వాళ్లంతా ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కావాలి. అందుకు మా హోటల్ను వినియోగించుకోవాలని మున్సిపల్, ప్రైవేట్ ఆసుపత్రులకు తెలిపాం’’ అని సోనూ సూద్ పేర్కొన్నారు. కాగా, ముంబైలోని జుహూ ప్రాంతం శక్తి సాగర్లో సోనూ సూద్ కుటుంబానికి ఆరంతస్తుల హోటల్ ఉంది. ఇక సోనూ సూద్ సినిమా విషయానికి వస్తే.. ‘హ్యాండ్స్ అప్’ సినిమాతో ఆయన టాలీవుడ్కు పరిచయమయ్యారు. అయితే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో సోనూ సూద్కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత ‘అరుంధతి’ సినిమాలో పసుపతిగా తన నటవిశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాలో నటనకు గాను బెస్ట్ విలన్గా నంది అవార్డు కూడా అందుకున్నారు.
జగన్ కేసులు… టీడీపీ పుంజుకుంటుంది… అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు