telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత జట్టుకు 5 కోట్ల బోనస్ ప్రకటించిన బీసీసీఐ…

ఐపీఎల్ తర్వాత భర్త జట్టు నేరుగా ఆస్ట్రేలియా పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ఎంతో మంది గాయపడిన ఆసీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీం ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ 4 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-1 తో సొంతం చేసుకున్న భారత జట్టు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో పైకి దూసుకెళ్లింది. ఈ సిరీస్ ముందు వరకు టెస్ట్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు రెండో స్థానానికి వెళ్ళింది. ఇక అలాగే టెస్ట్ ఛాంపియన్ షిప్ లో న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి ఏకంగా మొదటి స్థానానికి దూసుకెళ్లింది. అయితే ఈరోజు జరిగిన చివరి టెస్ట్ లో రిషప్ పంత్ అద్భుతంగా రాణించడంతో భారత్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంతంగా సాగిన ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు భారత విజయం సాధించింది. అయితే భర్త జట్టు యువ ఆటగాళ్లతో చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించడంతో జట్టుకు 5 కోట్ల బోనస్ ప్రకటించింది బీసీసీఐ. దాంతో టెస్ట్ జట్టు ఆటగాళ్లందరికి మ్యాచ్ ఫీ 15 లక్షలు కాకుండా ఈ డబ్బులు కూడా వస్తాయి.

Related posts