సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో రోజుకొక్క విషయం వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య తర్వాత డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసందే. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఎన్సీబీ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. ఈ కేసులో సారాతో పాటు దీపిక పదుకొణే, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, ఫ్యాషన్ డిజైనర్ సిమోనీ ఖంబట్టా, దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్లను ఎన్సీబీ శనివారం ప్రశ్నించింది. మరోవైపు.. కరణ్ జోహార్ సంస్థ ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పని చేసిన క్షితిజ్ రవి ప్రసాద్కు ముంబై కోర్టు వచ్చే నెల 3 వరకూ రిమాండ్ విధించింది.
స్టార్ కిడ్ సారా అలీఖాన్ ను ఎన్సీబీ అధికారు విచారించారు. సెప్టెంబర్ 26 సారా అలీఖాన్ ను ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరైంది. నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో సారా అలీఖాన్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ఆమె సుశాంత్ తో డేటింగ్ చేసానని ఒప్పుకుందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సుశాంత్ తో కలిసి థాయిలాండ్ ట్రిప్ కు కూడా వెళ్లానని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ బ్రేక్ సమయంలో సుశాంత్ డ్రగ్స్ తీసుకునే వాడని, అలాగే సుశాంత్ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలకు హాజరయ్యానని కానీ డ్రగ్స్ తీసుకోలేదని సారా వెల్లడించిందట. తాను సిగరెట్స్ తాగేదానినని, డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని సారా ఎన్సీబీకు తెలిపిందని నేషనల్ మీడియా చెప్పుకొచ్చింది. ఇక ఎన్సీబీ అధికారుల విచారణలో దీపికా పదుకొనె తాను డ్రగ్స్ చాట్ చేసినట్టు ఒప్పుకుందని జాతీయమీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే దీపికా అధికారు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేదని కూడా తెలుస్తుంది.
previous post