మొబైల్ గేమ్ పబ్జీ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్. దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్జీ గేమ్ ఇకపై కనుమరుగు కానుంది. పబ్జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేసింది.ఈ మేరకు పబ్జీ ఫేస్ బుక్ పేజీలో అధికారిక ప్రకటన చేసింది. ఇవాళ్టి నుంచి{అక్టోబర్ 30 } నుంచి వినియోగదారులందరికీ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ గతంలోనే తొలగించబడింది. అయినప్పటికీ తమ తమ ఫోన్ లలో ఇన్ స్టాల్ చేసిన వారు ఇప్పటికీ ఈ పబ్జీ ని ఆడుకోవచ్చు. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఈ అవకాశం యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. కాగా..భారత్, చైనా సైనికుల మధ్య లఢక్లోని గాల్వన్ లోయ వద్ద ఇటీవల భారీ ఘర్షణ జరిగిన నేపథ్యంలో టిక్టాక్తో సహా 59 చైనా యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే భారత ఆర్మీ కూడా కొన్ని కీలక యాప్లపై ఆంక్షలు విధించింది. ఫేస్బుక్, టిక్టాక్, పబ్జీ, ట్రూకాలర్ సహా 89 యాప్స్ను తమ మొబైల్స్ నుంచి తొలగించాలని తన సిబ్బందికి భారత ఆర్మీ ఆదేశించింది.
previous post
next post