telugu navyamedia
రాజకీయ వార్తలు

హింస చెలరేగుతుంది.. అంతర్జాతీయ సమాజానికి ఇమ్రాన్ హెచ్చరిక

pak pm imran actions on ex pm and

భారత్ లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెడుతూ, జమ్మూకశ్మీర్ ను భారత ఆక్రమిత కశ్మీర్ అని సంబోధించారు.ఐఓకేలో 12 రోజుల కర్ఫ్యూ ఉన్న సమయంలో చేతుల్లో భారీ ఆయుధాలతో అదనపు బలగాలు. ఆర్ఎస్ఎస్ గూండాలు చేరారు. సమాచార వ్యవస్థ పూర్తిగా కనుమరుగైందన్నారు.

గతంలో గుజరాత్ లో ముస్లింలను ఏరివేసినట్టుగానే, మోదీ తనదైన శైలిలో జమ్మూకశ్మీర్ లో ముస్లింలను ఏరివేయాలని చూస్తున్నారని ట్విటర్ లో పేర్కొన్నారు. స్రెబ్రేనికా తరహాలో జరగనున్న నరమేధాన్ని ఈ ప్రపంచం మరోసారి చూడనుంది. ముస్లింలను ఐఓకే నుంచి ఏరివేయడమే వారి లక్ష్యం. అంతర్జాతీయ సమాజానికి ఇదే నా హెచ్చరిక. ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. హింస చెలరేగుతుందని హెచ్చరించారు.

Related posts