లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తరపున జాతీయ నాయకులు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ బహిరంగ సభలో బీజేపీ సీనియర్ నేత, కేంద్రం హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ హాజరయ్యారు. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు సభకు తరలివచ్చారు.
భారీస్థాయిలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం వద్ద ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సిబ్బంది నగర కమిషనర్ కార్తికేయను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.