కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మీడియం బాబురావు ధ్వజమెత్తారు… ఆదిలాబాద్ జిల్లా.. కేంద్రంలోని STU సంఘ భవన్ లో సిపిఎం పార్టీ జిల్లా మహాసభల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు… ముందుగా పార్టీ జెండాను ఎగురవేసి, ఇటీవల మరణించిన పార్టీ నాయకుల ఆత్మశాంతికై రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
అనంతరం పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుకు పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. జిల్లాలోని సహజ వనరులు ఇతరాత్ర వాటిని ఉపయోగించుకుంటున్న పాలకులు ఇక్కడి ప్రాంతాల అభివృద్ధిని విస్మరిస్తున్నారని ఆరోపించారు.
మోడీ పాలనలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా సిపిఎం పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.