telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సికింద్రాబాద్ స్టేషన్ కు పోటెత్తిన ప్రయాణీకులు

train secunderabad

వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను నడిపించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులకు కొత్త సమస్య వచ్చి పడింది. తమ తమ గ్రామాలకు వెళ్లేందుకు రైళ్లు తిరుగుతాయన్న ఆలోచనలో ఉన్న వలస కార్మికులు, నిరుపేదలు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. నాంపల్లి, కాచిగూడ స్టేషన్ ల వద్ద కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది.

మరోవైపు ప్రభుత్వం అనుమతించిన రైళ్లు మినహా ప్యాసింజర్ రైళ్లను తిప్పే అవకాశాలు లేవని, వచ్చిన వారు వెనక్కు వెళ్లిపోవాలని రైల్వే శాఖ అధికారులు కోరుతున్నా, ఎవరూ వినిపించుకోకుండా, స్టేషన్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో, స్పందించిన పోలీసులు, స్టేషన్ కు వెళ్లేందుకు నాలుగు వైపులా ఉన్న దారులను మూసివేసి వచ్చిన వారికి సర్దిచెప్పి వెనక్కు పంపించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్, ఎవరూ స్టేషన్ పరిసరాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

Related posts