వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో నటుడు, విద్యావేత్త మోహన్ బాబు భేటీ కానున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశం హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది.
దాదాపు గంట సమావేశం అనంతరం వీరు 11:30 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొనున్నారు. ఇటీవల మోహన్ బాబు ఏపీ ప్రభుత్వం తన విద్యాసంస్థలకు బకాయి పడ్డ ఫీజు రీయింబర్సుమెంట్ పై నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటివి చేయడం వెనుక వైసీపీ హస్తం ఉందని విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ మళ్ళీ మోహన్ బాబును రాజకీయాలలోకి రప్పిస్తుందా.. అనేది చర్చనీయాంశం అయ్యింది.