telugu navyamedia
తెలంగాణ వార్తలు

గాంధీ ఆస్పత్రిలో ప్రసూతి విభాగం..

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో హైరిస్క్ కేసులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రసూతి విభాగానికి కొత్తగా 200 పడకలతో నిర్మాణపనులు మరో ఆరునెలల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు.

గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ను మంత్రి హరీశ్ రావు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో కలసి ప్రారంభించారు. కరోనా విస్తరించిన సమయంలో గాంధీ ఆస్పత్రి వైద్యులు అందించిన సేవలను ఆయన గుర్తుచేశారు. 80 వేలకు పైగా కరోనా పేషంట్లకు వైద్యం అందించారని తెలిపారు.

Related posts