telugu navyamedia
తెలంగాణ వార్తలు

స్థానిక సంస్థలు బలోపేతం..

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థలను బలోపేతంచేశారని నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు శుభాకాంక్షలు తెలిపారు.

తనను ఏకగ్రీవంగా ఎన్నుకోడానికి సహకరించిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్సీ కవిత సమావేశంలో చర్చించారు.

ప్రజా సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తెచ్చారు. ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన సమస్య పరిష్కారానికి ఎమ్మెల్సీ కవిత వెంటనే స్పందించి సంబంధిత మంత్రులు, అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.

Related posts