telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌…

మందు బాబులకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. హోలీ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లోని వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్‌ పాటించాల్సిందిగా తెలుపుతూ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఇతరులకు అసౌకర్యం కలిగించడం, రోడ్లపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం వంటి తదితర చర్యలను నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించారు. ఈ నియమాలను ఉల్లంఘించినైట్లెతే అటువంటి వ్యక్తులు విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Related posts