telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మత్తు వదలరా” ట్రైలర్ రాజమౌళి ప్రశంసలు

Mathu

ప్రముఖ సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం “మ‌త్తు వ‌ద‌ల‌రా”. నూతన దర్శకుడు రితేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సాగిన ఈ చిత్రం ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో శ్రీసింహా రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ చిత్ర టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌గా, ఫ‌స్ట్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుద‌లైంది. తాజాగా రానా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు తెలిపారు. చిత్రంలో నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. ట్రైల‌ర్‌పై అఖిల్‌, రానా, రాజ‌మౌళితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. “సింహా,కాళ భైర‌వ ఇద్దరు “మ‌త్తు వ‌ద‌ల‌రా” చిత్రంతో డెబ్యూ ఇస్తున్నారు. ఇది నాకొక ఎమోష‌న‌ల్ మూమెంట్. రితేష్ ప‌నిత‌నం బాగుంది. డిసెంబ‌ర్ 25న షూటింగ్ మానేస్తా మానేస్తా” అని రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Related posts