ప్రస్తుతం తెలుగు హీరోల్లో నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో టక్ జగదీష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కతుంది. మరొకటి శ్యామ్ సింగరాయ్ మాత్రం కలకత్తా బ్యాక్డ్రాప్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే నేడు ఈ సినిమా చిత్రీకరణలో మరో విలక్షణ నటుడు పాల్గొన్నారు. ఈ మేరకు సినిమా మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. అతడెవరో కాదు.. బెంగాలి నటుడు జిష్షు సేన్గుప్త. భీష్మ, అశ్వథామ వంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇతడు శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించనున్నారన్న వార్త హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాలో సేన్గుప్త ఎటువంటి పాత్రలో కనిపిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.
previous post
next post
రాజధానిని ఇడుపులపాయకు తరలించేందుకు ప్రయత్నాలు: దేవినేని