telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆ విషయంలో కేసీఆర్‌, హరీశ్‌ రావుకు డాక్టరేట్లు ఇవ్వొచ్చు : డీకే అరుణ

dk-aruna

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో బిజెపి కార్యకర్తలు, నాయకులపై టీఆర్ఎస్ పోలీసులతో దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని డీకే అరుణ పేర్కొన్నారు. బిజెపి అభ్యర్థి ఇంటిపైన దాడి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రమైన చర్య అని… అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా గెలవాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తే ప్రజలు సహించరన్నారు. టిఆర్ఎస్ అక్రమాలకు, దౌర్జన్యాలకు, దాడులకు బిజెపి కార్యకర్తలు ఆందోళనకు గురి కావద్దని ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని కోరారు. టీఆర్ఎస్ ఎత్తుగడలను రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఓడిపోతామనే భయంతోనే దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అల్లుడిని ముందు పెట్టి సీఎం కెసిఆర్ వెనకుండి నడిపిస్తున్నారని విమర్శించారు. అబద్దాలు చెప్పే విషయంలో సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు కు డాక్టరేట్లు ఇవ్వొచ్చునని డీకే అరుణ ఎద్దేవా చేశారు.

Related posts