పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం నాచురల్ బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించారట… అయితే ప్రస్తుతం సాయి పల్లవి టాలీవుడ్లోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు. అందం, అబినయంతో అమ్మడు అందరి మనసులు దోచుకున్నారు. అంతేకాకుండా సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఓ వార్త సినీ సర్కిల్స్లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే… సాయిపల్లవి అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటించడానికి నో చెప్పారని వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు కారణాలు కూడా చాలానే వినిపిస్తున్నాయి. కొందరు సాయి పల్లవి డేట్స్ ఖాళీ లేకపోవడం కారణం అంటున్నారు. మరి కొందరు సినిమాలో తన పోర్షన్ తక్కువగా ఉన్నందుకే సాయి పల్లవి సినిమాని రిజెక్ట్ చేశారంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ పాత్రకు భార్య పాత్ర కోసం మూవీ మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించారు. అయితే అమ్మడు ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని తెరకెక్కిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా కనిపించనున్నారు.
previous post
ఆ నర్స్ ను బాగా వాడేసి వదిలేశావ్… గుర్తుందా ?… తేజపై శ్రీరెడ్డిపై తేజ సంచలన ఆరోపణలు