telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీ రైతుల ఖాతాలోకి .. 3వేలు జమ, …అంతా అన్నదాత సుఖీభవ పథకం మహిమ ..

TDP Candidate withdraw Badwel

నేడు ఏపీ రైతన్నలకు శుభవార్త అనే చెప్పాలి. రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభవ పథకం మొత్తాన్ని సర్కారు జమ చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రతి రైతు ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేసిన ప్రభుత్వం ఇవాళ మొదటి విడత మొత్తం మిగిలిన రూ.3వేలు వారి ఖాతాల్లోకి బదిలీ చేసింది.

దాదాపు 45 లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.1349.81 కోట్లు మేర సర్కారు ఇవాళ జమ చేసింది. పెట్టుబడి సాయం కింద ఏటా 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.15వేలు, పెద్ద రైతులకు రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Related posts