telugu navyamedia
రాజకీయ వార్తలు

రాష్ట్రానికి వచ్చేవారు క్వారంటైన్ నిబంధనలు పాటించాలి:యడియూరప్ప

Yadyurappa

కరోనా కట్టడికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ, చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు తప్పకుండా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.మొత్తం 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని సూచించారు. అందులో మూడు రోజులు సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాలని, మిగతా 11 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారికి మాత్రమే వారం రోజుల సంస్థాగత క్వారంటైన్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో కరోనా లక్షణాలు లేకపోతే మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు.మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వారిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని, కాబట్టి వారి రాకను నియంత్రించే చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా యడియూరప్ప పేర్కొన్నారు.

Related posts