telugu navyamedia
తెలంగాణ వార్తలు

మేడిగ‌డ్డ ముంపు బాధ్య‌త‌ల‌కు ప‌రామ‌ర్శ‌ : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క‌ అరెస్ట్..

*మేడిగ‌డ్డ ముంపు బాధ్య‌త‌ల‌కు ప‌రామ‌ర్శ‌కు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క‌
*భట్టి విక్రమార్క‌ను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
*భూప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లింపు

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బుధవారం నాడు సీఎల్పీ బృందం వెళ్తున్న  బృందాన్ని భూపాలపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు

తాము ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని సీఎల్పీ బృందం తేల్చి చెప్పింది. పోలీసుల తీరును నిరసిస్తూ సీఎల్పీ బృందం రోడ్డుపై బైఠాయించి పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. . . అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని భూప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఈ సంద‌ర్భంగా భట్టి విక్రమార్క‌ మాట్లాడుతూ..  ప్రాజెక్టులు, ముంపు ప్రాంతాలు సందర్శించకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. టెర్రరిస్టుల మాదిరిగా ఇల్లందు గెస్ట్​హౌస్‌లో తమను బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాన్ని అణచివేసేందుకే పోలీసులను ప్రభుత్వం వాడుకుంటుందని భట్టి విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యక్రమం ఆగేది లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Related posts