telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్‌ నేతల మృతి

bomb blast srilanka

శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనలో ఇద్దరు జేడీఎస్‌ నేతలు మృతిచెందినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. వారిని కేజీ హనుమంతరాయప్ప, ఎం. రంగప్పగా గుర్తించారు. ఎన్నికల ప్రచారం అనంతరం ఈ నెల 20న ర్ణాటకలోని జేడీఎస్‌ పార్టీకి చెందిన ఏడుగురు నేతలు శ్రీలంక విహార యాత్రకు వెళ్లారు. కొలొంబోలోని ‘ద షాంగ్రిలా హోటల్‌’లో రెండు గదుల్లో బస చేసినట్లు సమాచారం. అదే చోట బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ పేలుడు అనంతరం ఈ ఏడుగురి నేతల ఆచూకీ తెలియకుండా పోవడంతో ఆందోళన నెలకొంది. ఇద్దరు చనిపోయినట్లు తేలడంతో మిగితా వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జేడీఎస్‌ నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నేతల గల్లంతు తనను షాక్‌ గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. గల్లంతైన నేతల ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

Related posts