telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

యూరప్ బయలుదేరిన చంద్రబాబు

Chandrababu foreign tour with family

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు యూరప్ బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ఆయన ప్రత్యేక లేఖ ద్వారా తెలిపారు. నేడు ఢిల్లీలో జరగనున్న పార్టీల అధ్యక్షుల సమావేశానికి తాను హాజరు కాబోవడం లేదని పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం, తాను విదేశాలకు వెళ్లాల్సి వుందనన్నారు.

ఇక ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరిని తెలుపుతూ ఓ లేఖను టీడీపీ ఎంపీలకు చంద్రబాబు అందజేయగా, వారు ఆ లేఖను నేడు ప్రహ్లాద్ జోషికి అందించనున్నారు. తన కార్యక్రమం ముందుగా ఖరారై పోయిందని, ఆ తరువాతే సమావేశపు ఆహ్వానం తనకు అందిందని చంద్రబాబు తెలిపారు. అన్ని అంశాలపై తమ అభిప్రాయాలను తెలుపుతూ లేఖను పంపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 24 వరకూ చంద్రబాబు విదేశీ పర్యటన కొనసాగనుంది.

Related posts