telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ప్లాస్మా థెరఫీ ట్రయల్స్ కు కేంద్రం అనుమతి: కేజ్రీవాల్

arvind-kejriwal

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చేపట్టిన ప్లాస్మా థెరపి ఫలితాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్లినికల్ ట్రయల్స్ కొనసాగిస్తామని తెలిపారు. ఎన్‌ఎల్‌జేపీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు. శుక్రవారంనాడు ఓ ట్వీట్‌లో కేజ్రీవాల్ ఈ విషయం తెలియజేశారు.

రాజస్థాన్‌లో నిలిచిపోయిన ఢ్లిల్లీ విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు తమ ప్రభుత్వం శుక్రవారంనాడు 40 బస్సులు పంపుతోందని చెప్పారు. సత్వరమే వారిని వెనక్కి రప్పిస్తామని, 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచుతామని చెప్పారు. వలస కార్మికుల సమాచారంపై కూడా ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు.

Related posts