telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సర్కారు వారి పాట” మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్

SVP

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు. ఇప్పటికే కొన్ని ట్యూన్లు కూడా అందించాడట. “సర్కారు వారి పాటకు సంబంధించి తాజాగా అద్భుతమైన మ్యూజిక్ కంపోజింగ్స్ జరిగాయి. మహేష్ గారికి మంచి పాటలు అందించేందుకు వీలుగా అద్భుతమైన సన్నివేశాలను సృష్టించిన డార్లింగ్ డైరెక్టర్ పరశురామ్‌కు ధన్యవాదాలు. నిర్మాతలకు కృతజ్ఞతలు” అని తమన్ ట్వీట్ చేశాడు. ఇక జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే.

Related posts