ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీం ఇండియా పట్టుబిగిస్తున్నది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఆసీస్ బ్యాట్స్మెన్ తడబడుతున్నారు. రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఆస్ట్రేలియా వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 91 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ను వాషింగ్టన్ సుందర్ వికెట్ల ముందు దొరకబట్టాడు. దీంతో 75 బంతుల్లో 48 పరుగులు చేసిన వార్నర్ రెండో వికెట్ రూపంలో వెనుతిరిగాడు. వార్నర్ దీనిపై సమీక్షకు వెళ్లినా ఔట్ అనే తేలింది. కాగా.. ఓవర్ నైట్ స్కోరు 21-0 తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ ఓపెనర్లు టీం ఇండియా సహనాన్ని పరీక్షించారు. దాదాపు 20 ఓవర్లు వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే హారిస్ను శార్ధూల్ ఠాకూర్ జౌట్ చేయగా…అటు లబుషేన్ ను 25 పరుగుల వద్ద, వాడేను 0 పరుగుల వద్ద సిరాజ్ పెవిలియన్కు పంపాడు. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ 12, కెమెరూన్ గ్రీన్ 2 పరుగులతో ఉన్నారు. 163 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ జట్టు ఉంది.
previous post
శ్రీరెడ్డి నిన్ను వదలా… ఎంతమందితో… : రాకేష్ మాస్టర్ ఫైర్