ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఏ సమయానికి ప్రాణాలు పోతాయో ఎవరికీ తెలీదు. సరిగ్గా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. మధ్య ప్రదేశ్లోని జైన ఆలయంలో పూజ చేస్తూ ఓ మాజీ ఎమ్మెల్యే అక్కడే కుప్పకూలాడు. ఆ తరువాత ఆలయ సిబ్బంది అతడిని లేపే సరికి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని బైతూల్ కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వినోద్ డాగా ప్రతిరోజూ ఉదయం స్థానిక జైన ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఎప్పటిలాగానే ఈనెల 12న కూడా జైన ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. అక్కడి పార్శనాథుడి మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత స్వామి వారి తలను పెట్టి దర్శించుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇటీవల మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో వినోద్ డాగా కు కాంగ్రెస్ పార్టీ మెహ్ గావ్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. మరణానికి ఒకరోజు ముందు భోపాల్లో పార్టీ సమావేశానికి కూడా హాజరయ్యారు.
previous post
హుజూర్ నగర్ లో ఉత్తమ్ భార్యను పోటీకి ఎలా నిలుపుతారు?: కర్నె ప్రభాకర్