ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకొంది. కొవిడ్ సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 8297 104 104 నెంబర్ కు కాల్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కరోనా పరిస్థితులపై సమాచారం తెలుసుకోవచ్చు.
ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనాపై సమాచారమే కాకుండా సహాయం కూడా పొందవచ్చని ఆ ప్రకటనలో తెలిపింది.