సుప్రీంకోర్టు జడ్జిలుగా జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ రంజన్ గొగొయ్ ప్రమాణ స్వీకారం చేయించారు.
వీరిద్దరి ప్రమాణంతో సుప్రీం జడ్జిల సంఖ్య 28కి చేరింది. సుప్రీంలో మొత్తం 31 మంది జడ్జిలు ఉండొచ్చు. జస్టిస్ సంజీవ్ ఖన్నా దిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేయగా, జస్టిస్ దినేష్ మాహేశ్వరి కర్ణాటక హైకోర్టు జడ్జిగా పనిచేశారు.