telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హాస్టల్స్ మూసివేతపై ముందే చర్చిస్తే బాగుండేది: పవన్ కల్యాణ్

pawan-kalyan

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిననేపథ్యంలో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి కొస్తే, చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం హాస్టల్స్ లో ఉంటున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.ప్రైవేట్ హాస్టల్స్ ను వెంటనే మూసివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యాజమాన్యాలు హాస్టల్స్ మూసివేశారు.

దీంతో స్వస్థలాలకు వెళ్లేందుకు విద్యార్థినీ విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. పరిస్థితిని అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. పోలీస్ శాఖ ద్వారా ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ తీసుకుని ఏపీలోని వారి స్వస్థలాలకు వెళ్లే అవకాశం కల్పించింది. అయితే, ఈ పత్రాలతో బయలుదేరిన వారిని ఏపీ సరిహద్దుల్లో ఆపివేయడం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఈ మూడు అంశాల గురించి ఆలోచించాలని కోరుతూ ట్వీట్ చేశారు. హాస్టల్స్ మూసివేతపై ఇరు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అన్నారు. ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుని వారిని వారి స్వస్థలాలకు చేర్చాలని, అవసరమైన వైద్య పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉండమని సూచించాలని కోరారు.

Related posts