ఏప్రిల్ 30వ తేదీ తెలంగాణలో పర్యటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ పర్యటనలు ఖరారయ్యాయి.
ఈ పర్యటనలో భాగంగా అందోల్ నియోజకవర్గంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ మే 3, 4 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు.నేపథ్యంలో నారాయణపేట్, చేవెళ్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు మోదీ హాజరవుతారు.
అయితే రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలదళం భావిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్ర, జాతీయ నేతలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మోడీ తెలంగాణలో పర్యటిస్తారని సమాచారం.