telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ధూళిపాళ్ల అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చిన రోశయ్య…

Kilari Rosaiah YSRCP

హెరిటేజ్ కోసం చిత్తూరు డైరీని మూత వేసిన ఘనత చంద్రబాబుదేనన్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య డైరీలను టీడీపీ వారికి ఆస్తులు కూడబెట్టుకునే వనరులుగా మార్చుకుంటున్నారని అన్నారు. అందుకే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారని అన్నారు. అలాగే దీనిలో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాడి పరిశ్రమను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ ఎన్నో అడుగులు వేస్తున్నారన్న ఆయన అందుకే ఆముల్ సంస్థ 5 రూపాయలు అదనంగా చెల్లిస్తోందని అన్నారు. సంగం డైరీలో 77 ఎకరాలు రైతులు, ప్రభుత్వం ఇచ్చిందని, దీన్ని తాకట్టు పెట్టి 100 కోట్లకు పైగా అప్పులు తెచ్చుకున్నారని అన్నారు. నరేంద్రని కాపాడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు…దానిలో నీ వాటా ఉందనా…?  అని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు. సంగం డైరీ పేరుతో జరిగిన మోసాలను వెనకేసుకు రావడం సిగ్గుచేటన్న ఆయన ఆముల్ సంస్థ కూడా కో ఆపరేటివ్ సంస్థ..దానికి యజమాని రైతులేనని అన్నారు. రైతులకు అందాల్సిన లాభాలు అందాలని ఈ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు పాల రైతులను మోసం చేసి వేల కోట్లు సంపాదించాడని అన్నారు.

Related posts