గత నెల రోజుల నుంచి మెహర్ రమేష్, చిరంజీవి కాంబోలో కొత్త సినిమా రానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడింది. వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోందని క్లియర్ హింట్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మెహర్ రమేష్కి రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ”చిరంజీవి గారితో మీరు చేయబోతున్న సినిమాకు ఆల్ ది బెస్ట్” అని చెప్పారు. దీంతో చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోపై ప్రేక్షకుల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఈ సినిమాకు కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో సినిమా చేయాల్సిందిగా చిరంజీవిని ఆయనే ఒప్పించారని టాక్. కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్లో నటించనున్నారు. ఇక ఆ వెంటనే మెహర్ రమేష్తో చిరంజీవి సినిమా పట్టాలెక్కనుంది.
previous post