పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నారా లోకేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద వరదల వలన పాడైన చేపలను పరిశీలించడానికి ఆ జిల్లాలో పర్యటించారు లోకేష్. అక్కడి మత్స్యకారులతో మాటా మంతి కూడా చేసారు. కానీ అప్పుడే లోకేష్ కు ప్రమాదం తప్పింది. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద లోకేష్ ట్రాక్టర్ నడిపారు. టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ట్రాక్టర్పై వెళుతుండగా అదుపు తప్పి ట్రాక్టర్ ఉప్పుటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే రామరాజు ట్రాక్టర్ను అదుపుచేశారు. దీంతో ప్రమాదం తప్పింది. వెంటనే లోకేష్ ను ట్రాక్టర్ నుంచి దింపేశారు యంయల్ ఏ రామరాజు. హటాత్తుగా జరిగిన ఈ ఘటనతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హడలిపోయారు. అయితే ఈ ఘటనతో లోకేహ్ మరోసారి రాష్ట్రంలో ట్రేండింగ్ లోకి వచ్చారు. మరి ఈ విషయం పై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేదాని పై ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.
జగన్ అప్పుడే సీఎం అయ్యేవారు: నటి హేమ