telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓటర్ల జాబితా .. ముసాయిదా విడుదల..

voter list in rangareddy district released

రంగారెడ్డి జిల్లాలో 3 కార్పొరేషన్లు,12 మున్సిపాలిటీల పరిధిలోని ఓటర్ల ముసాయిదా జాబితా విడులైంది. జిల్లాలో 6,40,352 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 3,29,261, మహిళలు3,11,023, ఇతరులు 68మంది ఓట ర్లు ఉన్నారు. జనవరి 4వ తేదీన తుది జా బితా ప్రకటిస్తారు. అప్పుడే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.నేతలు, ఆశావహుల దృష్టంతా ప్రస్తుతం రిర్వేషన్లపైనే ఉంది. ఆయా పార్టీల నుంచి టిక్కె ట్లు ఆశిస్తున్నవారు తమ వార్డు ఏ వర్గానికి రిజర్వు అవుతుందోననే విషయాన్నే ప్రధానంగా అనుచరులతో చర్చిస్తున్నారు. ఓటర్ల జాబితాను వర్గాల వారీగా వడపోస్తుండటంతో కొందరు తమ బాగా పరిచయమున్న అధికారుల వద్ద ఆరా తీస్తున్నారు.

జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలలో పో లింగ్‌ కేంద్రాల వారీగా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లను గుర్తించిన అధికారులు వార్డుల వారీగా విభజించి ముసాయిదాను విడుదల చేశారు. అయితే గత జూలై లో 6,22,270 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం 18,082 ఓటర్లు పెరిగారు.

Related posts