telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలి : అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Lockdown KCR Akbaruddin Owaisi MIM

జీహెచ్ఎంసి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా జరుగుతున్నది.  అన్ని పార్టీలు గెలుపుపై ధీమాతో ప్రచారం నిర్వహిస్తున్నాయి.  ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అధికారపార్టీ తెరాస పార్టీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  4700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈరోజు కనీసం 700 ఎకరాలు కూడా లేదని అన్నారు.  హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ప్రభుత్వం చెప్తోందని, హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని అక్బరుద్దీన్ అన్నారు.  ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వలేదని, ఈ ఎన్నికల్లో కూడా మాయమాటలు చెప్తున్నారని అయన విమర్శించారు.  అసెంబ్లీ మీ తోక ఎలా తొక్కాలో మాకు బాగా తెలుసు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై అధికార టిఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.  ఇప్పటికే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. ఎన్టీఆర్, పీవీ సమాధులను కూలిస్తా అన్నాడట ఓవైసీ.. దమ్ముంటే కూల్చరా… నీ దారుసలేం భవనాన్ని క్షణాల్లో కొల్చేస్తారు మా కార్యకర్తలు అంటూ సవాల్‌ విసిరారు బండి సంజయ్‌. 

Related posts