telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడిగా కలెక్టర్‌ భర్త

తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన ఎంపీపీ ఎన్నికలో ఓ కలెక్టర్‌ భర్త కో ఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. భార్య ఉన్నత స్థానంలో ఉన్నా గడచిన రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలకే పరిమితమైన ఆయన చిన్నపదవి అయినా పెద్దగా భావిస్తారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిషత్‌ పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడిగా కైసర్‌ అహ్మద్‌ ఎంపికయ్యారు.

కైసర్‌ భార్య ఆయేషా మస్రత్‌ ఖానమ్ ప్రస్తుతం వికారాబాద్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1996లో పంచాయతీ వార్డు సభ్యునిగా రాజకీయ అరంగేట్రం చేసిన కైసర్‌ 2002లో తిమ్మాపూర్‌ సహకార సంఘం కో ఆప్షన్‌ సభ్యునిగా ఎన్నికయ్యారు. గతంలో రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే కైసర్‌ ఇటీవల కొన్నాళ్లుగా దూరంగా ఉంటూ వచ్చారు. తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మళ్లీ ఆయనను తెరపైకి తెచ్చి కో ఆప్షన్‌ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Related posts