తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి తలపడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం లోకేష్ నామినేషన్ వేయనున్నారు. ఉండవల్లిలోని స్వగృహంలో తొలుత ప్రత్యేక పూజల అనంతరం ఆయన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరిలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో లోకేశ్ సతీమణి బ్రాహ్మణి కూడా అక్కడ ఉన్నారు.
ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న నేపథ్యంలో ఆయన తరఫున సతీమణి భువనేశ్వరి కుప్పంలో శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.
కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు అసెంబ్లీ బరిలో దిగడం ఇది ఏడవ పర్యాయం. గతంలో కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యకర్తలే చంద్రబాబు తరఫున నామినేషన్ వేశారు. 2014 ఎన్నికల్లో కుమారుడు లోకేశ్ చంద్రబాబు తరపున నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈసారి భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు.