telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముంపు పరిస్థితులు తన మనసును కలచివేశాయి: సోము వీర్రాజు

Somu Veerraju BJP

పోలవరం ప్రాంత ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇచ్చారు.ఈ రోజు పోలవరం ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాటలాడుతూ ముంపు పరిస్థితులు తన మనసును కలచివేశాయని పేర్కొన్నారు.

సరైన ప్లానింగ్ లేక కాఫర్ డ్యాం ఎత్తు పెంపుదల వల్ల గిరిజన గ్రామాల ప్రజలకు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts