ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఓ చిన్నారి మరణం రాజకీయ దుమారం రేపింది. తన ర్యాలీలో ఓ చిన్నారి మృతి పట్ల రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ స్పందిస్తూ.. చిన్నారిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు..
వైసీపీ ప్రభంజనానికి భయపడి శవరాజకీయం చేస్తున్న వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. బీసీలుతో పెట్టుకోవద్దని ఉషశ్రీచరణ్ హెచ్చరించారు
అయితే మంత్రి ఉషశ్రీచరణ్ వ్యాఖ్యలకు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తండ్రి చనిపోతే మూడేళ్ల పాటు శవ రాజకీయాలు చేసింది జగన్మోహన్రెడ్డి అని జేసీ ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు.
తాడిపత్రికి వచ్చి తనపై విమర్శలు చేయడం వల్ల ఏం ఉపయోగమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చనిపోయిన చిన్నారి తండ్రి వికలాంగుడు అని.. ఆయనకు పెన్షన్ ఇప్పించాలని జేసీ ప్రభాకర్రెడ్డి సవాల్ విసిరారు. అలా పెన్షన్ ఇప్పిస్తే నీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
మంత్రి ఉషశ్రీ చరణ్ కంటే తాను గట్టిగా విమర్శలు చేయగలనని హెచ్చరించారు. మహిళ కాబట్టే అన్ని విషయాలు చెప్పానని.. కర్ణాటక లోకయుక్తా , సుప్రీం కోర్టు కేసుల విషయం గురించి చెప్పమంటారా అని నిలదీశారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నావని గుర్తు తెచ్చుకోవాలని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మంత్రిని కోరారు.
క్రిస్మస్ కానుక ఎత్తేసిన వ్యక్తి జగన్ గారు: నారా లోకేశ్ ట్వీట్