బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు ప్రభుత్వం కౌలు చెల్లించడం లేదంటూ గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంత రైతులు తనను కలసి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో జగన్ కు తాను బహిరంగ లేఖ రాశానని చెప్పారు.
తన లేఖపై స్పందిస్తూ రూ. 187.40 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఇదే విధంగా రాజధానిపై అమరావతి రైతుల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను కూడా తొలగించాలని అన్నారు. రాజధాని పై నెలకొన్న అపోహలకు వెంటనే ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నట్టు కన్నా పేర్కొన్నారు.
ఈవీఎంలలో జరిగిన అవినీతి వల్ల.. వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువ: కేఏ పాల్