ఏపీలోని నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయలయ్యాయి. ఈ ఘటన పాల్వాయి పాడు వద్ద చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అసలు ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. టిప్పర్ డ్రైవర్ తప్పు ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
previous post
next post