విశాఖపట్నం మల్కాపురం పరిసరాల్లో ఓ కామాంధుడికి మహిళలు దేహశుద్ధిచేశారు. స్కూలుకు, ట్యూషన్ కెళ్లే చిన్నపిల్లలకు పుస్తకాలు, పెన్నులు ఇస్తామని అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు ఆలస్యంగా తెలుసుకున్న స్థానిక మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు.
మల్కాపురంకు చెందిన రౌడీ షీటర్ దోమానా చిన్నారావును పట్టుకుని నడివీధిలో దేహశుద్ధి చేశారు. కామాంధుడి వెకిలిచేష్టలను ఉపాధ్యాయులకు తెలపడంతో దుర్మార్గుడి దుశ్చర్య వెలుగుచూసింది. పిల్లల తల్లిదండ్రులకు చిన్నారావు వెకిలిచేష్టలు తెలుసుకుని బడితపూజచేశారు. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు అప్పగించారు.