telugu navyamedia
క్రైమ్ వార్తలు

వికారాబాద్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా….

హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. కల్కొడ చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తు ఒక్కసారిగా బోల్తాపడింది ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ ప్రయాణికులను మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. మర్పల్లి మండలం

కల్కొడ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే, ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో.. ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు

Related posts